Ap State Agama Advisory Board, జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. అర్చకులు, ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త – ap government appointed state agama advisory board
ఈ బోర్డులో సభ్యులుగా సంస్కృత పండితులు మహా మహోపాధ్యాయ దోర్బల ప్రభాకర్ శర్మ, పి.కృష్ణమాచార్యులు (శ్రీవైష్ణవ ఆగమం), నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి (వీరశైవ ఆగమం), మృత్యుంజయశర్మ (శైవాగమ శాస్త్ర పండితులు), బుట్టే వీరభద్ర సిద్ధాంతి(వాస్తు, జ్యోతిషం), జేకే సుబ్బారావు (వైదికం), బొద్దుపల్లి దాత్తాత్రేయ శర్మ (శాక్తేయ ఆగమం), ఖండవల్లి సూర్యనారాయణాచార్యులు (వైఖానస ఆగమం), అక్కి రాఘవేంద్రాచార్య (తంత్రసారం), కళ్లేపల్లి సుబ్రహ్మణ్యం (స్మార్త వైదికాగమనం), వారణాసి నాగభూషణం (గ్రామ దేవత), ఆర్వీవీవీ గోపాలాచార్య (పాంచరాత్రం) లను నియమించారు.
అంతేకాదు దేవాదాయ అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్గా వ్యవహరించే ఈ బోర్డులో.. దేవాదాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, టీటీడీ ఈవో, టీటీడీ ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, ఏపీ అర్చక సమాఖ్యకు చెందిన ఎ.ఆత్రేయబాబు, పి.శ్రీనివాసులు, హిందూ దేవాదాయ ధర్మాదాయ సంస్థల సిబ్బంది సంఘానికి చెందిన వి.శ్రీనివాస్లను సభ్యులుగా ఉన్నారు. అలాగే కార్యదర్శి, కోశాధికారిగా దేవాదాయ కమిషనర్ను నియమించారు.
అంతేకాదు ఈ ట్రస్టు బోర్డులో అనధికార సభ్యులైన పి.శ్రీనివాసులు, వి.శ్రీనివాస్, ఆత్రేయబాబులు మూడేళ్లు సభ్యులుగా కొనసాగుతారని తెలిపారు. రూ.20 లక్షలపైన వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలు, దేవాదాయ సంస్థల నుంచి 3% చొప్పున ఈ నిధి కింద వసూలు చేసి.. అర్చకులు, ఆలయాల్లో ఉద్యోగులకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు వినియోగిస్తారని చెప్పారు. మొత్తం ఏ ప్రభుత్వం దేవాదాయశాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
మరోవైపు దేవాదాయ శాఖ పరిధిలోని పలు దేవాలయాలను రూ.249.26 కోట్ల సి.జి.ఎఫ్. నిధులతో అభివృద్ది పర్చేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు కొట్టు సత్యనారాయణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోని దేవాలయాలను అభివృద్ది చేసేందుకు ఈ నిధులను వెచ్చిస్తున్నామన్నారు. అలాగే హిందూ మత ధర్మంపై విస్తృతమైన ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో త్వరలో దేవాదాయ శాఖ ఆద్వర్యంలో పీఠాధిపతులు, మఠాధిపతుల విశిష్ట సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News