News

ap mlc election under mla quota, ఏపీలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఈసారి నారా లోకేష్ పదవి కూడా, మొత్తం ఏడు! – election commission releases schedule for another 7 mlc posts under mla quota in andhra pradesh


ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు మరోసారి షెడ్యూల్ వచ్చేసింది. త్వరలో శాసనమండలిలో ఖాళీకానున్న ఏడు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నికైన నారా లోకేష్, పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, గంగుల ప్రభాకరరెడ్డి, బచ్చుల అర్జునుడు, పెన్మెత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజుల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నికైన చల్లా భగీరథరెడ్డి గతేడాది నవంబరు 2న అనారోగ్యంతో మృతిచెందడంతో ఆ స్థానం కూడా ఖాళీగా ఉంది.

ఈ ఏడు స్థానాలకు మార్చి 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. పదవీకాలం పూర్తవుతున్న నారా లోకేష్, బచ్చుల అర్జునుడు టీడీపీ ఎమ్మెల్సీలు. పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, గంగుల ప్రభాకరరెడ్డి, పెన్మెత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజులు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు. కన్నుమూసిన చల్లా భగీరథరెడ్డి కూడా వైఎస్సార్‌సీపీ సభ్యుడే. ఇటు పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల నియోజకవర్గాలకు మార్చి 13న ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్నికలకు నోటిఫికేషన్ మార్చి 6న ఇస్తారు.. నామినేషన్లకు చివరి తేదీ మార్చి 13. అలాగే మార్చి 14న నామినేషన్లు పరిశీలిస్తారు.. మార్చి 16న నామినేషన్ల ఉపసంహరణ.. మార్చి 23న (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు) ఎన్నికలు జరగనున్నాయి. కౌంటింగ్, ఫలితాలు సాయంత్రం 5 గంటలకు ఉంటుంది.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button