News
ap mlc election results, MLC Elections: 3 స్థానాల్లోనూ టీడీపీ విజయం.. తెలుగు తమ్ముళ్ల సంబరాలు – telugu desam party wins 3 graduate mlc seats in andhra pradesh
49 మంది అభ్యర్థులు పోటీ పడ్డ ఈ స్థానంలో ప్రతి రౌండ్లోనూ ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. టీడీపీ, వైసీపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగింది. అధికారికంగా ఫలితాలను ప్రకటించడానికి ముందే తెలుగు తమ్ముళ్ల సంబరాలు ప్రారంభమయ్యాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో బాణాసంచా కాలుస్తూ గెలుపు సంబరాలు నిర్వహించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ మాత్రం ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. రీకౌంటింగ్ నిర్వహించాలంటూ అభ్యర్థి రవీంద్రారెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నాగలక్ష్మి జోక్యం చేసుకొని ఆయనకు నచ్చజెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఆందోళనలు చేయవద్దని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.