News
ap govt employees electric bikes, ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో గుడ్న్యూస్.. రూ.10 వేల నుంచి రూ.5 వేల వరకు – ap govt mou on electric bikes for employees
ప్రభుత్వం ఈ వాహనాలు కొనుగోలు చేసిన ఉద్యోగుల వేతనాల నుంచి ఈఎంఐ అవకాశం ఇస్తోంది. నెలకు కనీసం రూ.2,500 చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని గతంలోనే ఎన్ఆర్ఈడీసీఏపీ సూచించింది. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ నిర్ణయంతో ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
ఈవీల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్క్యాప్ సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో హైవేలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రైవేట్ స్థలాలు వంటి చోట్ల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జ్ అయ్యే స్టేషన్లని తీసుకురావాలనుకుంటున్నారు. అంతేకాదు ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రోత్సాహించడం ద్వారా వాతావరణంలో కాలుష్యం తగ్గించొచ్చు అనేది ఆలోచన.
- Read Latest Andhra Pradesh News and Telugu News