News

20 ఏళ్ల తర్వాత సంతానం.. ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చిన తల్లి, ఇంతలో మాటకలందని విషాదం



ఆ జంటకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది.. కానీ సంతానం లేరనే బాధ మాత్రం వెంటాడుతూనే ఉంది. అయితే ఆమె 20 ఏళ్ల తర్వాత గర్భం దాల్చి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ భర్తకు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.. ఆమె అనారోగ్యంతో ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయింది. కనీసం బిడ్డల్ని కూడా చూడకుండానే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.ఎన్టీఆర్ జిల్లా మండలం మాగల్లుకు చెందిన షేక్‌ నజీరాకు.. పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు సంతానం మాత్రం లేదు.. 20 ఏళ్ల తర్వాత నజీరా గర్భం దాల్చడంతో కుటుంబంలో ఆనందంలో మునిగిపోయింది. పది రోజుల క్రితం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నజీరాకు డాక్టర్లు సిజేరియన్ చేసి ముగ్గురు పిల్లలను బయటకు తీశారు. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు ఉన్నారు. సిజేరియన్ తర్వాత నజీరాకు రక్తం తక్కువగా ఉండటంతో డాక్టర్లు వెంటనే రక్తం ఎక్కించారు. కానీ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. బుధవారం ఆమె మృతదేహాన్ని పల్లగిరికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 20 ఏళ్ల తర్వాత ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన నజీరా ఇక లేదని తలచుకుని భర్త, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆటో డ్రైవర్‌‌గా ఉన్న ఖాసిం భార్య ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నం ఫలించలేదు. తన ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు చేస్తూ అటు పసిపిల్లలకు ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. భార్య ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయానని..పిల్లలను ఎలా కాపాడుకోవాలో అని ఖాసిం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

  • Read Latest and

Related Articles

Back to top button