News
బిస్కెట్, చాక్కెట్లు తింటున్నారా..? ఒకసారి చెక్ చేసుకోండి.. వాటిని కూడా రీసైక్లింగ్
: హైదరాబాద్లోని బొడిప్పల్లో అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా పట్టుబడింది. కాలం చెల్లిన వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు తినుబండారాలు, షాంపులు, సబ్బులను రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కాలం చెల్లిన వస్తువులు, పదార్ధాలను రీసైక్లింగ్ చేసి కొత్త లేబుల్ వేసి విక్రయిస్తున్నారు. మొత్తం 300 రకాల వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.వస్తువులు, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే గోదాంలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. బొడుప్పల్తో పాటు కోఠిలోని హరిహత్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిపిన సోదాలు చేరి రీసైక్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇక్కడ కాలం చెల్లిన చాలా వస్తువులకు కొత్త లేబుల్ వేసి మార్కెట్లోకి పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.నిందితులను రిమాండ్లోకి తీసుకుని ప్రశ్నిస్తామని, ఎప్పటినుంచి ఈ పని చేస్తున్నారనే విషయం తెలుసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. స్థానికుల నుంచి వచ్చిన సమాచారంతో గోదాంలలో సోదాలు జరిపి పట్టుకున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలు తినే చాక్కెట్లు, బిస్కెట్లను ఎక్కువగా రీసైక్లింగ్ చేస్తున్నారని, ఇలాంటి కాలం చెల్లిన వస్తువులను తినడం ద్వారా చిన్నారులు అనారోగ్యాల బారిన పడే అవకాశముందని చెబుతున్నారు.నగర శివారులో పలుచోట్ల ఇలాంటి గోదాంలు ఉన్నట్లు తెలుస్తోంది. కాలం చెల్లిన వస్తువులను సేకరించి కొత్త లేబుల్ వేసి మార్కెట్లోకి పంపిస్తున్నారు. ఇలా చేస్తూ రూ.కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నట్లు సమాచారం. చాలాకాలంగా ఇలాంటి వ్యవహారాలు జరుగుతుండగా.. ఇప్పుడు పోలీసులకు ఈ ముఠాలు పట్టుబడ్డాయి. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి ముఠాలు విస్తరించినట్లు ఉన్నట్లు తెలుస్తోంది.