News

పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం.. విచిత్ర చోరీ చూసి పోలీసులే షాక్



: మన ఇంట్లో దొంగలు పడి చోరీకి పాల్పడితే వెంటనే పోలీసులను ఆశ్రయిస్తాం. అలాగే బయట ఎక్కడైనా మన వస్తువులు చోరీకి గురైతే హుటాహుటిన వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తాం. మన విలువైన వస్తువులను దొంగల నుంచి తిరిగి వచ్చేంతవరకు పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఎవరైనా ఫిర్యాదు చేయగానే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. కొన్నిసార్లు దొంగలను పట్టుకుని తిరిగి సొమ్ము బాధితులకు అందిస్తారు. మరికొన్ని సందర్భాల్లో దొంగల ఆచూకీ లభించపోతే పోలీసులు కేసు గురించి పట్టించుకోరు.కానీ అత్యంత రక్షణ, సెక్యూరిటీ కెమెరాలు ఉండే పోలీస్ స్టేషన్‌లోనే చోరీ జరగడం ఇప్పుడు విచిత్రంగా మారింది. ఈ ఘటన జిల్లాలోని కౌతాళం పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. కోసిగికి చెందిన కటిక షబ్బీర్‌తో పాటు మరో ఇద్దరిని చోరీ కేసులో జూన్ 26వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎల్‌ఈడీ టీవీ, ఎలక్ట్రికల్ సామాన్లు, హొండా యూనిక్రాన్ బైక్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అయితే పోలీస్ స్టేషన్‌లో ఉన్న బైక్ టైర్లు, సామాగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు మార్చి వేరేవి అమర్చారు. ఇది గమనించిన బాధితుడు.. పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు తెలియకుండా ఎవరు మారుస్తారని ప్రశ్నిస్తున్నాడు. పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ వింత దొంగతనం వెలుగులోకి రావడంతో.. ఇది ఇంటి దొంగల నిర్వాహకమా? లేక బయట దొంగల పనా? అని స్థానికులు తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఈ విచిత్ర దొంగతనం గురించి విని పోలీస్ ఉన్నతాధికారులే షాక్ అయ్యారు. దీనిపై ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఎవరైనా చోరీకి పాల్పడితే బైక్‌ను తీసుకెళతారు. కానీ బైక్ టైర్లను మార్చడమే వెరైటీగా అనిపిస్తుంది. భద్రత కల్పించమని ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తారు. అలాంటిది పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం చోటుచేసుకోవడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు.

Related Articles

Back to top button