News

త్వరలోనే నారా లోకేశ్ అరెస్ట్…? ‘ఇండియా’ కూటమిలోకి టీడీపీ..?



స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుణ్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేపడుతున్నాయి. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో నారా భువనేశ్వరీ, బ్రాహ్మణి సైతం పాల్గొన్నారు. తన తండ్రి అరెస్ట్ నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ వెళ్లారు. అక్కడ పలువుర్ని కలుస్తోన్న లోకేశ్.. చంద్రబాబు అరెస్ట్ జరిగిన తీరును వివరిస్తున్నారు. స్కిల్ డెవలప్‌‌‌మెంట్ విషయంలో చంద్రబాబు తప్పేమీ చేయలేదని చెబుతున్నారు. తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీలో జగన్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఎవరు కలిసొచ్చినా చేతులు కలుపుతామని ఇతర పార్టీలకు లోకేశ్ స్నేహ హస్తం చాచారు.సీఎం జగన్‌పై కేసుల వేగం ఎందుకు తగ్గిందని ప్రశ్నించిన లోకేశ్.. అవినీతిపరుడైన జగన్.. అవినీతి ఆరోపణలతో చంద్రబాబును అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. ఢిల్లీలో ఉన్న లోకేశ్, రాజమండ్రిలో ఉన్న బ్రాహ్మణి నోట ఒకే మాట రావడం గమనార్హం. లోకేశ్‌ను సైతం రేపో మాపో అరెస్ట్ చేయొచ్చని బ్రాహ్మణి చెప్పగా.. తనను సైతం అరెస్ట్ చేయొచ్చని లోకేశ్ వ్యాఖ్యానించడం గమనార్హం. అరెస్ట్ కావడానికి కొద్ది రోజుల ముందు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే వ్యాఖ్యానించారు. రేపో ఎల్లుండో తనను అరెస్ట్ చేయొచ్చన్న బాబు అంచనా నిజమైన నేపథ్యంలో లోకేశ్, బ్రాహ్మణి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.స్కిల్ డెవలప్‌మెంట్ కేసు చిన్న తీగ మాత్రమేనని.. లాగే కొద్దీ డొంక కదులుతుందని.. ఇది శాంపిల్ మాత్రమే.. ముందు ముందు అసలు సీన్ ఉంటుందని వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబుపై విచారణకు ఇప్పటికే పలు కేసులు రెడీ ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బాబు హయాంలో మంత్రిగా పని చేసిన లోకేశ్‌ను సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇండియా కూటమిలో టీడీపీ?చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. నారా లోకేశ్‌కు ఇండియా కూటమికి చెందిన నేతలు మాత్రమే ఫోన్లు చంద్రబాబును సపోర్ట్ చేస్తున్నారన్నారు. టీడీపీ ఇండియా కూటమి భాగస్వామి అని ఇది రుజువు చేస్తోందన్నారు. అధికారం కోసం కలిసి రావాలని, పవర్‌లోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకోవాలనేది వారి వ్యూహమన్న విజయసాయి.. టీడీపీకి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదన్నారు.

Related Articles

Back to top button