News
చంద్రబాబు సపోర్టర్స్కు ఆర్జీవీ 12 సూటి ప్రశ్నలు.. స్పందిచకపోతే అవునని ఒప్పుకున్నట్టేనటా..!
టీడీపీ అధినేత , జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను లక్ష్యంగా చేసుకొని ట్విట్టర్ వేదికగా తనదైన స్టైల్లో ట్వీట్లు వదిలే వివాదాస్పద డైరెక్టర్ తాజాగా మరో ట్వీట్ వదిలారు. కాగా.. ఈసారి చేసిన ట్వీట్ వైరల్గా మారింది. నిన్న చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్.. టీడీపీ, జనసేన పొత్తుపై చేసిన ప్రకటనపై ఆర్జీవీ కొంచెం ఘాటుగానే స్పందించారు. “ఒక లివింగ్ టుగెదర్ జంట ఎట్టకేలకు పెళ్లిని ప్రకటించింది.. నేను ఏ సందర్భంలో లేదా ఎవరిని ఉద్దేశించి ఇలా చెప్పానో చెప్పగలరా..?” అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. దీంతో పాటు.. చంద్రబాబును సమర్థించే వాళ్ల కోసం ఓ 12 ప్రశ్నలను కూడా సంధించారు ఆర్జీవీ. అయితే.. చంద్రబాబును సమర్థించేవాళ్లు ఈ 12 ప్రశ్నలకు.. ఒక్క మాటలో అవునా..? కాదా..? అని సమాధానం చెప్పాలంటూ.. ఇరుకున పెట్టేశారు ఆర్జీవీ. చంద్రబాబు సపోర్టర్స్కు ఆర్జీవీ సంధించిన ప్రశ్నలివే..1. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై చేసుకున్న ఒప్పందం బోగస్… అవునా ? 2. ఈ ఫేక్ ఒప్పందంతోనే రూ 300 కోట్లు పైగా ఇచ్చేశారు.. అవునా ? 3. ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం నుంచి ఈ డబ్బు విడుదల చేయడానికి అన్ని రూల్స్ను ఉల్లంఘించారు. డబ్బు విడుదలకోసం అధికారుల అబ్జెక్షషన్స్ పెడచెవిన పెట్టారు.. అవునా ? 4. తమకు ఎలాంటి డబ్బు ముట్టలేదని.. అసలు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని.. సీమెన్స్ కంపెనీ లిఖిత పూర్వకంగా చెప్పింది.. అవునా ? 5. 90శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చే ఎలాంటి స్కీం తమ వద్దలేదని సీమెన్స్ చెప్పింది.. అవునా ? 6. ఈ మేరకు సెక్షన్ 164 CRPC కింద జడ్జి ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు, సీమెన్స్ అధికారులు స్టేట్మెంట్లు ఇచ్చారు.. అవునా ? 7. విడుదల చేసిన ఆ డబ్బు ఎక్కడికి పోయిందో తెలుసుకోవాల్సిన భాద్యత ప్రభుత్వానికి వుంది.. అవునా ? 8. ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో కనిపెట్టాల్సిన భాద్యత ప్రభుత్వానికి వుంది.. అవునా ? 9. రూ. 300 కోట్లకుపైగా డబ్బును షెల్ కంపెనీల ద్వారా, మధ్యవర్తుల ద్వారా మళ్లించారు.. అవునా ? 10. స్కిల్ కేసులో ED దర్యాప్తుచేసి నలుగురిని అరెస్టుచేసి ఆ విషయాన్ని తన అకౌంట్ ద్వారా ట్వీట్ చేసింది. అధికారికంగా పత్రికా ప్రకటన విడుదలచేసింది. ఇప్పుడు మీ అభియోగం సెంట్రల్ ఏజెన్సీ అయిన ED ఈ విషయంలో రాజకీయ ప్రతీకారానికి దిగిందని అంటున్నారు.. అవునా ? 11. విజయవాడలోని ACB కోర్టు దాదాపు 10 గంటలసేపు ఇరుపక్షాల వాదనలు విని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించే చంద్రబాబుకు రిమాండ్ విధించింది.. అవునా ? 12. ఇళ్ల నిర్మాణం విషయంలో డబ్బు చంద్రబాబు చేతిలోకి వెళ్లిందనే విషయాన్ని ఐటీ నోటీసుల ద్వారా ఎలా వెలుగులోకి వచ్చిందో.. అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అనేక షెల్ కంపెనీలు, నిందితులైన యోగేష్ గుప్తా, మనోజ్ వాసుదేవ్ పార్దసాని తదితరుల ద్వారా ఆయన మాజీ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్కు, అక్కడ నుంచి ఆయనకు చేరిందని ఈడీ చెప్తోంది.. అవునా ?ఒకవేళ కాదంటే పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పారిపోయినట్టు? ఈ 12 ప్రశ్నలకు స్పందించకపోతే అన్ని ప్రశ్నలకి అవునని సమాధానమిచినట్టే.. అంటూ ఆర్జీవీ ట్వీట్ చేసి.. చంద్రబాబు సపోర్టర్స్ను ఇరుకున పెట్టేశారు.