కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు: ఇళ్లు, రోడ్లకు బీటలు.. జనం పరుగులు! – small earthquake in kurnool district tuggali mandal
కాగా, గత నెల ఫిబ్రవరిలో ఏపీలోని పలు జిల్లాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భూప్రకంపనలు రావడంతో ఆ జిల్లా వాసులు భయంతో వణికిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కంచికర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. మరోవైపు, పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా, కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు రావడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.