News

ఏలూరు: ఈ వాలంటీర్ మామూలోడు కాదుగా.. మహిళ అకౌంట్‌లో డబ్బులు నొక్కేసి, ఎలా దొరికాడంటే!



ఏలూరు జిల్లాలో వాలంటీర్ ఘరానా మోసం బయటపడింది. ఒంటరి మహిళ బ్యాంకు అకౌంట్ నుంచి వాలంటీర్ డబ్బులు కొట్టేశాడు. కొయ్యలగూడెంకు చెందిన కొట్రా నాగమణి ఇటీవల బ్యాంకుకు వెళ్లి తన అకౌంట్‌లో రూ.13,500 జమ చేసింది.. ఇంకా అకౌంట్‌లో మొత్తం ఎంత డబ్బు ఉందని బ్యాంకు సిబ్బందిని అడిగారు. ఇప్పుడు జమ చేసిన రూ.13,500 మాత్రమే ఉందని చెప్పడంతో ఆమె అవాక్కయ్యారు. అకౌంట్ తాను ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదని చెప్పడంతో సిబ్బంది బ్యాంకు స్టేట్‌మెంటు పరిశీలించారు.ఈ క్రమంలో ఆమె వేలిముద్ర ద్వారా రూ.లక్షా 75 వేల వరకు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో బాధితురాలు మంగళవారం వాలంటీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో వాలంటీరు పలుమార్లు తన వేలిముద్ర తీసుకుని మోసం చేసి డబ్బులు నొక్కేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తున్నారు. సచివాలయం 2లో వాలంటీర్‌గా పనిచేస్తున్న అయినపర్తి వినోద్ చేతివాటం ప్రదర్శించినట్లు బాధితురాలు అంటున్నారు. వాలంటీర్ వినోద్ నాగమణి దగ్గర వేలిముద్రలు తీసుకుని పలు దఫాలుగా డబ్బులు అకౌంట్ నుంచి డ్రా చేసినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button