News
అమ్మాయి విషయంలో గొడవ.. నడిరోడ్డుపై ఏపీ మాజీ డీజీపీ కుమారుడు వీరంగం!
, ఏపీపీఎస్సీ ఛైర్మన్ కుమారుడు డేవిడ్ సవాంగ్ వివాదంలో చిక్కుకున్నారు. యువతి విషయంలో గొడవ పడి నడిరోడ్డుపై ఓ యువకుడిని చితకబాదాడు. బుధవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్10లో ఉన్న జీరో 40 పబ్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు యువకులు రెండు వర్గాలు విడిపోయి దాడులు చేసుకున్నారు. పబ్ పార్కింగ్ విషయంలో గొడవ తలెత్తిందని ఓ వర్గం చెబుతుండగా.. యువతి విషయంలో ఘర్షణ జరిగిందని మరో వర్గం యువకులు చెబుతున్నారు. డేవిడ్ సవాంగ్ చేసిన దాడిలో సిద్ధార్ధ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ముఖం, కన్ను, చేతులపై విచక్షణారహితంగా దాడి చేశారు. తమపై దాడిని ప్రశ్నించడంతో అంతు చూస్తానని బెదిరించినట్లు బాధితులు చెబుతున్నారు. దాడుల గురించి సమాచారం అందడంతో జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. కుమారుడి నిర్వాకానికి తండ్రి గౌతమ్ సవాంగ్ వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.